శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (16:55 IST)

అనంతపురం జిల్లా మత్తయ్యకుంట్లను దత్తత తీసుకున్న వివేక్ ఒబెరాయ్!

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం అనంతపురం జిల్లాలో ఉండగా, ఆ గ్రామం పేరు ముత్తయ్యకుంట్ల. శనివారం పరిటాల రవి వర్థంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ, ఇక నుంచి తనను అనంతపురం జిల్లా వాసిగా గుర్తించాలని కోరారు. పరిటాల రవి తనకు సోదరుడు వంటి వారని, జిల్లా అభివృద్ధిపై ఆయన ఎన్నో కలలు కన్నారన్నారు. ఆ అభివృద్ధిలో భాగమయ్యేందుకే తాను ముత్తయ్యకుంట్ల గ్రామాన్ని దత్తత చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.