శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (12:39 IST)

రైతుల కోసం ఆమరణ దీక్ష చేస్తా : పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరమో అంతే తీసుకోవాలని, అదనంగా ఒక్క ఎకరం కూడా తీసుకోవద్దని చెప్పారు. రైతుల భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఆమరణ దీక్షకు సైతం సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
రాజధాని కోసం బలవంతంగా భూములు లాక్కుంటే తాను చూస్తూ ఊరుకోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టం కింద భూములు లాక్కుంటామంటే భయపడవద్దని... మీ సమస్య తీరే వరకు తానుంటానని భరోసా ఇచ్చారు. రైతుల కోసం జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు.
 
ప్రభుత్వం చట్టాలు చేసి, బలవంతంగా భూములను లాక్కుంటే రైతులకు అండగా తాను నిలుస్తానని చెప్పారు. రాజధానికి 5వేల నుంచి 8వేల ఎకరాల భూమి సరిపోతుందేమోనని తనకు ఎన్నోసార్లు అనిపించిందని... అయితే, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కోసం భారీగా భూమి అవసరమవుతుందేమోనని భావించానని తెలిపారు.