శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (12:59 IST)

తెలుగు ప్రజల సమస్యలపై నరేంద్ర మోడీపై సమరం : పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమర శంఖం పూరించనున్నట్టు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.  
 
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తానని అందులో పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన సమస్యలకు కేంద్రం పరిష్కారం చూపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
కాగా, సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలకు మద్దతిస్తున్నానని, జనసేన పార్టీ కార్యకర్తలు ఓటేసి గెలిపించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు విజయం సాధించాయి. దీంతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు.