శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (18:09 IST)

పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు ‘పిడికిలి’!!: ఆగస్టు 15న ప్రకటన?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఆగస్ట్ 15న తన పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలకు పుల్ స్టాప్ పెట్టేందుకు స్వాతంత్ర్యం దినోత్సవాన జనసేన ఎన్నికల గుర్తును ప్రకటించాలని పవన్ టీం భావిస్తోంది. పార్టీ గుర్తుగా 'పిడికిలి ని'ఎన్నుకున్నట్లు జనసేన పార్టీ వర్గాల సమాచారం. 
 
జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు కూడా పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. ఓ వైపు గోపాల గోపాల షూటింగ్‌లో పాల్గొంటూనే... మరోవైపు జిల్లాల వారీగా తాత్యాలిక కమిటీలు ఏర్పాటుకు పవన్ తన అనుచరులతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేనను విస్తరించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.
 
గోపాల గోపాల షూటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. గబ్బర్ సింగ్ - 2 సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదం ఘటనపై స్పందించారు. ప్రమాద స్థలిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఓ వైపు షూటింగులు చేస్తూనే అవసరమైనప్పుడు బయటకు రావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు సమాచారం.