తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభ.... ఫ్యాన్స్కు సందేశమా...? ప్రత్యేక హోదా కోసమా...?
తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ విధివిధానాలు, సమాజసేవలో అభిమానులు పాత్రలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన 13 జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులకు పిలుప
తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ విధివిధానాలు, సమాజసేవలో అభిమానులు పాత్రలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన 13 జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులకు పిలుపు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వినోద్ రాయల్ కుటుంబాన్ని నిన్న పరామర్శించిన పవన్ కళ్యాణ్ శుక్రవారం కూడా తిరుమలలోనే ఉన్నారు. రేపు తిరుపతిలో సమావేశం ముగిసిన తరువాత హైదరాబాద్కు పయనమై వెళ్లనున్నారు.
పవన్కు గొంతు నొప్పి....
హత్యకు గురైన తన వీరాభిమాని కుటుంబాన్ని పరామర్శించడానికి తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. నిన్న తిరుపతి పర్యటన తరువాత నేరుగా తిరుమలకు వెళ్లిన ఆయన శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి నుంచి గొంతు నొప్పితో పవన్ కళ్యాణ్ భాదపడుతున్న నేపథ్యంలో తిరుమలలో పర్యటనను మొత్తాన్ని రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఎవరితోనూ పవన్ మాట్లాడడం లేదని సమాచారం. రేపు జరిగే సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతారన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.