గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (14:43 IST)

పవన్ కళ్యాణ్.. రాజధాని నిర్మాణానికి సహకరించండి ప్లీజ్ : చంద్రబాబు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో సహకరించాలని కోరినట్లు చెప్పారు. భూసమీకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఉదారంగానే అందించామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.
 
ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసంలో ఆయనను పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. భేటీలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాజధాని నిర్మాణానికి సహకారం అందించాలని పవన్ కల్యాణ్‌ను కోరినట్లు చెప్పారు. 
 
ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కుంటోందని జనసేన కార్యకర్తలు ఇటీవల ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి పవన్, చంద్రబాబుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భూ సమీకరణతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు, తాజా రాజకీయ పరిణామాలపైనా వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.