గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2017 (11:44 IST)

పవన్ పాదయాత్ర లేనట్టే.. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకలాపాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాటమరాయుడు రిలీజ్ తర్వాత విజయవాడ అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం కావడం చూస్తే ఇది నిజమేనని తెలుస్తోంది. అయితే రాయలసీమలో ఆయన పాద

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకలాపాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాటమరాయుడు రిలీజ్ తర్వాత విజయవాడ అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం కావడం చూస్తే ఇది నిజమేనని తెలుస్తోంది. అయితే రాయలసీమలో ఆయన పాదయాత్రకు రూట్ మ్యాప్ రెడీ అయినట్టు ఓ వైపు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం సహా ధర్మవరం, కదిరి, హిందూపురం, పుట్టపర్తి, గుంతకల్లు నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఎక్కువ ఉంది. తన పాదయాత్ర ప్రభావం వీరిపై పడి వీరి ఓట్లను కొల్లగొట్టవచ్చునని పవన్ భావిస్తున్నాడు. 
 
అయితే పాదయాత్ర విషయంలో వెనక్కి వెళ్లినట్టు పవన్ సన్నిహితులు చెప్తున్నారు. కాటమరాయుడు మూవీ హిట్‌తో ఇప్పుడు పాదయాత్ర చేస్తే దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చునని కూడా భావిస్తున్నారు. దీనికి తోడు రేపో.. మాపో.. త్రివిక్రమ్‌తో పవన్ కొత్త ప్రాజెక్టు కోసం డేట్స్ కూడా ఇచ్చారని.. అందువల్ల ప్రస్తుతానికి ఈ యాత్ర ఉండకపోవచ్చునని సమాచారం. వచ్చేనెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ ఖరారవుతుందని, దాంతో జనసేనాని బిజీగా ఉంటాడని దీంతో యాత్ర ప్రతిపాదన అటకెక్కినట్టేనని రాజకీయ పండితులు అంటున్నారు.