గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 19 అక్టోబరు 2014 (17:02 IST)

నేనెక్కడికీ వెళ్లలేదు... మీ అధికారం శాశ్వతం కాదు... పిన్నెల్లి

మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను ఖండిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక కొంతమంది టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. 
 
తెదేపా నాయకుల దుష్ప్రచారాన్ని తాను ఇప్పటికే ఉన్నతాధికారులతో చెప్పినట్లు వెల్లడించారు. తాను పోలీసు అధికారులకు చెప్పిన దానిపై న్యాయం జరుగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని అని అన్నారు. అధికారంలో ఇవాళ వారున్నారు, అది శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని అన్నారు.