బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (14:59 IST)

శోభనం ఆపండ్రా బాబూ... ఆపండి.... అంటూ అడ్డుపడిన ఖాకీలు.. పెళ్లి రద్దు.. ఎందుకు..?

పెళ్లయిన నవదంపతులకు పెద్దలు శోభనం తంతు నిర్వహించడం సహజం. ఈ తంతులో భాగంగా ఓ పెళ్లికొడుకు శోభనానికి రెడీ అయ్యాడు. అంతలోనే ఎక్కనుండి వచ్చారో తెలీదుగానీ, పోలీస్ వాహనం వచ్చి ఇంటి ముందు ఆగింది. ఆగమేఘాలతో లోపలికి వచ్చిన వారు వెంటనే ఈ శోభనాన్ని ఆపాలంటూ బిగ్గరగా అరిచారు. ఈ శోభన కార్యక్రమాన్ని రద్దు చేసి ఓ యువతి జీవితాన్ని పోలీసులు కాపాడారు. శోభనాన్నిఆపడమేంటి... యువతి జీవితాన్ని కాపాడడమేంటి... అని తలబద్దలు కొట్టుకుంటున్నారా.... అయితే ఈ కథనం చదవాల్సిందే... 
 
తూర్పు గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన ఈ యువకుడు(23) కొంతకాలం క్రితం గల్ఫ్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎయిడ్స్‌ ఉన్నట్లు నిర్ధారించారు. 
 
ఈ విషయాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకోవడమే కాకుండా, శోభనానికి కూడా రెఢీ అయ్యాడు ఈ ప్రబుద్ధుడు. ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి ఈ శోభన కార్యక్రమాన్ని ఆపి ఆ యువతిని రక్షించాడు. 
 
వరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తనకు ఎయిడ్స్‌ ఉన్నట్టు అంగీకరించాడు. దీంతో ఆ పెళ్లిని రద్దు చేయడానికి ఇరు వర్గాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు. సరైన సమయంలో యువతి జీవితాన్ని కాపాడిన వ్యక్తిని స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌, పోలీసులు, కుటుంబసభ్యులు అభినందించారు.