గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 మే 2016 (16:16 IST)

పుదుచ్చేరిలో రంగస్వామికి ఝులక్.. కాంగ్రెస్ కూటమికి విజయం

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. మొత్తం 30 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఎన్.ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోగా, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి 17 స్థానాలను దక్కించుకుంది. అలాగే, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు, అన్నాడీఎంకే నాలుగు, ఇతరులు ఓ చోట గెలుపొందారు.
 
ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చాయి. అసోం, కేరళలో అధికారాన్ని కోల్పోగా, పుదుచ్చేరిలో మాత్రం స్వల్వ ఊరట లభించింది. ఆ రాష్ట్రంలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 17 స్థానాల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమి విజయం సాధించి సొంతగా అధికారం చేపట్టనుంది.