శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (13:09 IST)

ఓరేయ్ జగన్.. దమ్ముంటి రారా : కె.ఏ.పాల్ సవాల్

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు దాడి చేశారు. పరుష పదజాలంతో దూషించారు. ఓరేయ్ జగన్.. దమ్ముంటి రారా అంటూ సవాల్ విసిరారు. నాతో డిబేట్‌కు రా. చేతకాని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావ్. నేడు జడుస్తాను అనుకుంటున్నావా? నేను ప్రపంచాన్ని జడిపించి ఇక్కడకు వచ్చాను. మా బీ-ఫారాలను దొంగలించడమేకాకుండా నా మీదే దాడి చేయిస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
శనివారం అర్థరాత్రి వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. భీమవరంలో తన హోటల్ గదిలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తాను గది తలుపు వేసేశానని చెప్పారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. గతంలో తనపై ఆనంద్.ఇన్ హోటల్‌లో దాడి చేసేందుకు ప్రయత్నించిన బ్యాచే ఇప్పుడు మరోసారి దాడికి ప్రయత్నించిందని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు ప్రాణహాని ఉందన్నారు.
 
ఈ విషయాన్ని తనకు జెడ్‌ప్లస్ టికెట్ ఇవ్వాలని కోరితే అప్పటి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఓ గన్‌మెన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. శనివారం రాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో దాడి జరిగిందని కేఏ పాల్ తెలిపారు. ఈ సమయంలో తన భద్రతాసిబ్బంది వెళ్లిపోయారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకా కేసు నమోదుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మీ ఫ్యాన్స్ సార్.. అంటూ వీరంతా తన గదిలోకి వచ్చేందుకు ప్రయత్నించారని కేఏ పాల్ తెలిపారు. దీంతో 'రేపు ఉదయం 9.45 గంటలకు రండి.. మాట్లాడుకుందాం' అని సూచించానన్నారు. అంతలోనే వారు గదిలోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో వేగంగా తలుపు వేసేశానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. జగన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు.