గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (10:55 IST)

వివాహిత ఆత్మహత్య.. కిరోసిన్ పోసుకుని.. అత్తామామలే కారణం..?

ప్రకాశం జిల్లాలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అత్తామామలే కారణమని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో గురువారం సాయంత్రం బుద్ధి ఉదయశ్రీ (29)అనే వివ

ప్రకాశం జిల్లాలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అత్తామామలే కారణమని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో గురువారం సాయంత్రం బుద్ధి ఉదయశ్రీ (29)అనే వివాహిత కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని మృతిచెందింది.

వివరాల్లోకి వెళితే.. వేటపాలెం మండలం దేశారుపేట పంచాయతీ రామ్‌నగర్‌లోని శాంతినగర్‌కు చెందిన ఉదయశ్రీకి, చీరాల మండలం జాండ్రపేటకు చెందిన బుద్ధి దుర్గానాగమల్లేశ్వరరావుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
నాగమల్లేశ్వరరావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. భార్యాభర్తలు హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు. వారి మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. గత శనివారం ఆమె భర్త దుర్గానాగమల్లేశ్వరరావు జాండ్రపేట వచ్చాడు. భార్యను తీసుకుని హైదరాబాదు తిరిగొచ్చాడు.

కానీ గురువారం ఉదయశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె అత్తామామలు ఆమె తల్లిదండ్రులకు మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.