కేబీఆర్ పార్కు కాల్పులు.. ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ చిక్కాడు!
కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తిని ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్గా గుర్తించిన విషయం తెల్సిందే. ఈ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంచి విచారణ జరుపుతున్నారు.
కాల్పులు జరిపిన తర్వాత జింఖానా క్లబ్ పక్క నుంచి ఒబులేష్ పారిపోయాడు. కేబీఆర్ పార్కులోకి ఓబులేష్ వచ్చిన దృశ్యాలు, పారిపోయిన దృశ్యాలున్న సీసీ టీవీ పుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓబులేష్తో పాటు మరో ముగ్గురి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఓబులేష్తో కాల్పుల్లో మరో ఇద్దరు పాల్గొన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, కేబీఆర్ పార్క్ కాల్పుల కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించడం విశేషం.