పిఎస్ఎల్వి-సి 27 కౌంట్డౌన్ ప్రారంభం..! మార్చి 28న రోదసిలోకి..!
శ్రీహరికోట నుంచి ప్రయోగించే పీఎస్ఎల్వీ - 27కి గురువారం ఉదయం కౌంట్డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ - 27ను నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి మార్చి 28వ తేదిన రోదసిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహ లాంచర్ని ఆ రోజు సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు.
కాగా ఈ ప్రయోగంపై మంగళవారం నిర్వహించిన రిహార్సల్ను శాస్తవ్రేత్తలు విజయంతంగా నిర్వహించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్.కిరణ్కుమార్ మంగళవారం రాత్రి షార్కు చేరుకొని ప్రయోగ వేదిక పై ఉన్న పిఎస్ఎల్వి-సి 27 రాకెట్ను పరిశీలించి శాస్తవ్రేత్తలతో సమావేశమై రాకెట్ పనితీరు తదితర అంశాల పై చర్చించారు.