గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (18:32 IST)

సైకో సూదిగాడిని పట్టిస్తే రూ.50వేల నగదు బహుమతి: వారం రోజులుగా హంగామా

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సైకో సూదిగాడు మహిళల్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి మహిళలు, బాలికలపై సూది గుచ్చేసి పరారైపోతున్నాడు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సైకో సూదిలో మత్తుమందు ఉందా? ఇంకేదైనా ప్రమాదకరమైన వైరస్‌ ఉందా? అనేది ఇంకా వైద్యులు, పోలీసులు ఇంకా తేల్చలేదు. 
 
ఈ నేపథ్యంలో వారం రోజులుగా సంచలనం రేకెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకో వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు సైకోను పట్టుకోవడంలో పోలీసులు విఫలం కావడంపై మండిపడ్డారు. శుక్రవారం లోపు సైకోను పట్టుకోవాలని ఐజీ, డీఐజీ, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో, సైకోను పట్టుకోవడానికి ప్రజల సహకారం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అంతేకాదు, సైకోను పట్టించిన వారికి రూ. 50 వేల నగదు బహుమతిని ప్రకటించారు.