గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (14:16 IST)

ఆస్తుల కోసం తండ్రి, వదినను బండరాయికి మోది చంపేసిన సైకో!

ఆస్తులకు ఆశపడి తండ్రి, వదినలను ఓ కొడుకు పొట్టనబెట్టుకున్నాడు. వారసత్వంగా తనకు రావాల్సిన భూమిని ఇప్పుడే పంచివ్వాలంటూ తండ్రిపై కొడుకు ఒత్తిడి చేశాడు. కాదన్నందుకు సైకోగా మారి హతమార్చాడు.. అడ్డొచ్చిన వదినను సైతం వెంటాడి చంపేసి పారిపోయాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్‌లో శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చంద్రకల్ గ్రామానికి చెందిన ముంగిమళ్ల ఆశమ్మ, సాయప్ప దంపతులకు ఇద్దరు కుమారులుండగా పెళ్లిళ్లు కూడా అయ్యాయి. రెండో కుమారుడు అశోక్‌కు కొంతకాలంగా మతిస్థిమితం సరిగాలేదు. ఉన్న మూడెకరాల పొలంలో తన వాటా పంచివ్వాలని తరచూ తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి మరోసారి ఘర్షణకు దిగాడు. అంతటితో ఆగకుండా బండరాయితో మోదడంతో తండ్రి సాయప్ప (55) అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.
 
అడ్డుకోబోయిన వదిన లక్ష్మి (26)ని సైతం అదే బండరాయితో మోది చంపేశాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అంతలోపే నిందితుడు పారిపోయాడు