బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (11:23 IST)

ప్రత్యేక హోదా రాదు.. ప్రత్యేక ప్యాకేజీ ఖాయం : పురంధేశ్వరి

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం అందించడం లేదన్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. 
 
ఇప్పటివరకూ రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టులను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని, అలాంటపుడు నిధులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఏపీ సర్కారు చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల, భోగాపురం విమానాశ్రయాల ప్రాజెక్టులపై బీజేపీకి కొన్ని అనుమానాలున్నాయని ఆమె అన్నారు. తమ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.