బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (18:33 IST)

పీవీ సింధూ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్... బాధ్యతలకు సింధూ ఓకే

పీవీ సింధూ రియో ఒలిపింక్స్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆమెకు నజరానాలు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమెకు గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇస్తామని తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆమెకు డిప

పీవీ సింధూ రియో ఒలిపింక్స్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆమెకు నజరానాలు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమెకు గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇస్తామని తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇస్తున్నట్లు ప్రకటించగా, అందుకు ఆమె సమ్మతించారు.
 
ఒలింపిక్ క్రీడల్లో విజయకేతనం ఎగురవేసిన నేపధ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు, ఏపీ రూ. 3 కోట్లు ఇప్పటికే నగదు బహుమతిని అందించాయి. ఇప్పుడు ఏపీ ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఇచ్చింది.