శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:42 IST)

నో వార్డెన్.... అర్ధరాత్రి రెచ్చిపోయిన పోకిరీలు.. బాలికల వసతిగృహంలో వెకిలి చేష్టలు

వీరు పోకిరీలు.. వారికి అమ్మాయిల హాస్టల్ కనిపిచింది. పైగా వార్డెన్ లేదు. ఇక వారి వెకిలి చేష్టల గురించి చెప్పాలా..? ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి అమ్మాయిలను వెకిలి చేష్టలతో కొందరు పోకిరీలు వేధించిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
హయత్‌నగర్‌లోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో అర్థరాత్రి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గోడదూకి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. 50మంది బాలికలున్న వసతిగృహంలో రాత్రి వార్డెన్‌ లేకపోవడం గమనించిన దుండగులు గోడదూకి లోపలికి ప్రవేశించి, విద్యార్థినులను భయబ్రాంతులకు గురి చేశారు. 
 
బాలికల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది.