మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (12:53 IST)

ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన చంద్రబాబుపై కేసు పెట్టాలి.. రఘువీరా డిమాండ్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌లలో కేసులు పెట్టాలని ఏపీసీసీ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన విశాఖపట్నం జిల్లా భీమిలీ నియోజకవర్గం సమన్వయకర్త చెన్నాదాస్ నివాసంలో శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రఘువీరా రెడ్డితో పాటు మాజీ మంత్రులు వట్టి వసంత్ కుమార్, బాలరాజు తదితరులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని హామి ఇచ్చి, మొండిచెయ్యి చూపిన రాష్ట్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అసలు ప్రస్తుతం టీడీపీ నేత చంద్రబాబు అధికారంలో ఉండటం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.