శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (09:30 IST)

రాహుల్‌ను చూస్తే భయపడే వారే వివాదం రేపుతున్నారు : ఏకే ఆంటోనీ

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చూస్తే భయపడేవారే లేనిపోని వివాదాలు రేపుతున్నారని కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అభిప్రాయపడ్డారు.
 
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ సెలవుపై వెళ్లడం పెద్ద వివాదాస్పదమైన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన రాహుల్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారన్నారు. రాహుల్ మరింత శక్తిమంతంగా, పార్టీని వేగంగా ముందుకు తీసుకెళ్లేలా శక్తిని సంతరించుకుని వస్తారని ఆయన పేర్కొన్నారు. 
 
రాహుల్ విరామం తీసుకుంటున్నాడే తప్ప పార్టీని వదిలిపోలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాల నుంచి రాహుల్ తప్పుకుంటాడని ఎవరూ భ్రమపడొద్దని ఆయన సూచించారు. అలాంటి కలలు కనడం మానాలని ఆయన సూచించారు. రాహుల్, సోనియాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.