గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (13:27 IST)

రైల్వే బడ్జెట్ 2015-16: కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్!

రైల్వే బడ్జెట్ 2015-16లో భాగంగా కాజీపేట- విజయవాడ మధ్య మూడోలైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. కాగిత రహితంగా సరకు నిల్వల నిర్వహణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆర్పీఎఫ్ బలగాలకు యోగాశిక్షణ ఇస్తామన్నారు. రైల్వే ప్రాంగణాల్లో జల సంరక్షణ చర్యలు, రైల్వేల్లో విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
దేశంలో పలు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సురేష్ ప్రభు సంతాపం వ్యక్తం చేశారు. భద్రతను అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికి కాపలాలేని రైల్వే గేట్ల  వద్ద ఆడియో-విజువల్ హెచ్చరికలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.