గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (20:08 IST)

హుదూద్ బాధితుల కోసం రాజమౌళి షార్ట్ ఫిలిమ్.. సందేశం!

బాహుబలి మేకర్ రాజమౌళి హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలనే ఆకాంక్షతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు. 
 
దీపావళి పండుగ సందర్భంగా మనం పెట్టే ఖర్చులో సగాన్ని తుపాను బాధితులకు ఇవ్వాలని ఈ ఫిల్మ్‌లో రాజమౌళి విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేయాలనే మెసేజ్ ఇందులో ఉంది.
 
"సగం దీపాలను మన హృదయాల్లో వెలిగిద్దాం... ఆ వెలుగును విశాఖ కళ్లలో చూస్తాం... పండుగ చేసుకుందాం"అంటూ ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. ఈ మెసేజ్‌కు హీరో రాణా వాయిస్ వినిపిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌‌కు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించారు.