గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (17:09 IST)

రంజాన్ మాసం... ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే వెళ్లిపోవచ్చు

అమరావతి : రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి : రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
రంజాన్ నెల సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు సాయంత్రం 4 గంటలకే వారు కార్యాలయాల నుంచి వెళ్లే అవకాశం కల్పించింది. ఇది ముస్లింలైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ, ఉపాధ్యాయులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.