శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 మే 2015 (10:39 IST)

హత్యకేసు ఖైదీకి సెల్ ఫోన్, మందు బాటిల్: జైలు పాలైన భార్య!

హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న భర్తకు సెల్ ఫోన్, మద్యం సీసాను అందించిన ఓ భార్య జైలు పాలైంది. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడకు చెందిన మహేష్ (33) జూన్ 8 నుంచి హైదరాబాదు సమీపంలోని చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. సోమవారం అతని భార్య లక్ష్మి ములాఖత్ కోరగా, జైలు అధికారులు అనుమతించారు.
 
మహేష్‌ను కలిసే సమయంలో జైలు భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో లక్ష్మిని తనిఖీ చేయగా, ఒక సెల్ ఫోన్‌తో పాటు మద్యం బాటిల్ లభించింది. దీంతో జైలు అధికారులు ఆమెను కుషాయిగూడా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.