గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (14:15 IST)

మొన్న తగలబెట్టారు.. నేడు ఘనస్వాగతం పలికారు.. పట్టాలపైకి రత్నాచల్

కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన ఆ సమాజికవర్గానికి చెందిన ఉద్యమకారులు... గత నెల 31వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తునిలో విశాఖపట్టణం - విజయావాడల మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు. ఇందులో మొత్తం 24 బోగీలు కాలిబూడిదయ్యాయి. దీంతో వారం రోజుల పాటు ఈ ఎక్స్‌ప్రెస్ సేవలను రద్దు చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఈ రైలు సేవలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 6.10 విజయవాడ నుంచి బయలుదేరిన ఈ రైలుకు తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఇంజిన్‌కు పూలమాల వేశారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం పలుకుతూ స్టేషన్‌లోనే దహనమై ఉన్న బోగీలకు ఫ్లెక్సీలు కట్టారు. ఆరు గంటల్లో గమ్యస్థానం చేరుకునే ఈ రైలులో ప్రయాణిచేందుకు కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల వాసులు ఆసక్తి చూపుతుంటారు.