గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (10:41 IST)

దొంగ దీక్ష, కొంగ జపం.. జగన్‌కు దీక్ష చేసే అర్హతే లేదు: రావెల

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏనాడైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారా అని ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల్ కిశోర్ బాబు తెలిపారు.

బుధవారం ఏపీ కేబినెట్‌లోని దాదాపు అందరు మంత్రులూ గుంటూరులోని నల్లపాడులో జగన్ చేపట్టిన దీక్షపై శివాలెత్తిపోయారు. ‘దొంగ దీక్ష, కొంగ జపం’ అంటూ మండిపడ్డారు. తాజాగా రావెల జగన్ దీక్షపై మండిపడ్డారు. అసలు జగన్‌కు దీక్ష చేసే అర్హతే లేదని ఆయన తేల్చిచెప్పారు.
 
ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ గుంటూరులో జగన్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా గొప్పదనం ఏమిటో, దాని వల్ల వచ్చే లాభాలు ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని జగన్ తెలిపారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోడీ ముందు చంద్రబాబు మోకరిల్లారని, అందుకే ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని మండిపడ్డారు.