శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (13:24 IST)

జగన్‌ అతి విశ్వాసమే కొంపముంచింది: మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి

వైకాపా అధినేత జగన్ మేనమామ,  ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తామన్న జగన్ అతి విశ్వాసమే పార్టీ కొంప ముంచిందని చెప్పారు.
 
ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని... అందుకే, ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించారు. 
 
ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయామని... 4 వేల ఓట్ల తేడాతో 25 నియోజకవర్గాల్లో ఓటమి చెందామని వ్యాఖ్యానించారు.