శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (17:46 IST)

రియల్ బూమ్... నిన్న గుంటూరు-బెజవాడలో 4 వేల రిజిస్ట్రేషన్లు

రాజధాని ఏర్పాటుపై కసరత్తు పచ్చి ఐడియాల పుట్ట. సింగపూర్, హాంకాంగ్.. ఇప్పుడు కొత్తగా పుత్రంజయా వచ్చి చేరింది. రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వాధినేత, మంత్రులు చేసే ప్రకటనలు రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్‌కు పెట్రోలు పోస్తున్నాయి. మరోవైపు స్పెక్యులేషన్ అరికట్టేందుకు చట్టం తెస్తామని రెవెన్యూ మంత్రి అంటున్నారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్టు రాకముందే సీఎం, మంత్రులు విజయవాడ -గుంటూరు మధ్య రాజధాని అని ప్రకటించడం వెనుక భారీ వ్యాపార లావాదేవీలు దాగున్నాయి.
 
ఐటిఐఆర్‌లు, సెజ్‌లు, పోర్టులు ఇలా లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రకటిస్తున్న ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వలేదు. రాజధాని కమిటీలో జీఎంఆర్, జీవీకే, అమర్ రాజా, నూజివీడు సీడ్స్ వంటి కంపెనీల అధినేతలు వున్నారు. వీరంతా విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని అని ప్రకటించడం పాత ఐడియానే. హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు సమాచారం లీక్ అయినందునే తెలుగుదేశం సన్నిహితులు అక్కడ చౌకగా భూములు కొనుక్కున్నారనే విమర్శలున్నాయి. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ భూములు కొంటున్నారో ఇక్కడ...?