గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (16:02 IST)

అప్పిచ్చిన పాపం.. తిరిగి రాలేదని మనస్తాపం.. రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య!

అప్పిచ్చిన పాపానికి ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవటంతో మనస్తాపం చెందిన ఆల్విన్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాను ఇచ్చిన రూ.30 లక్షలు తిరిగి ఇవ్వనందువల్లే తన ఆత్మహత్యకు బిల్డర్ కారణమంటూ అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దాంతో బిల్డర్ ఇంటి ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.