మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి... ఒకరికి తీవ్ర గాయాలు
తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లా ఆళగడ్డకు వెళ్తున్న డీసీఎం వ్యాను పాలెం వద్ద రోడ్డు దాటుతున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యానులో ప్రయాణిస్తున్న దస్తగిరి(30), మహబూబ్పాషా(28) అక్కడికక్కడే మృతిచెందారు.
తీవ్రంగా గాయపడ్డ మహబూబ్పాషా(30)ను వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీలో ఉన్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.