శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (13:46 IST)

20 ఇళ్ళని దోచేసిన దొంగలు: 20 తులాల బంగారం, రూ.లక్ష గోవిందా!

వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసుకున్నారు. వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు శుక్రవారం వేకువజామున బీభత్సం సృష్టించారు. ఇక్కడి 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు.
 
దొంగలను అడ్డుకున్నఒక జంటపై ఇనుప రాడ్లతో దాడి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెలలో జిల్లాలో ఇదే క్రమంలో దోపిడి జరగడంతో దానిపై పోలీసులు దృష్టి సారించారు.