వరంగల్ ములుగులో 20 ఇళ్లను దోచేసిన దోపిడి దొంగలు!
ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వరంగల్ ములుగులోని 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసుకుని 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అబేస్ చేసేశారు. శుక్రవారం వేకువజామున ఈ తతంగం జరిగింది.
ములుగులోని 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో దొంగలను అడ్డుకున్నఒక జంటపై ఇనుప రాడ్లతో దాడి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెలలో జిల్లాలో ఇదే క్రమంలో దోపిడి జరగడంతో దానిపై పోలీసులు దృష్టి సారించారు.