గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 జూన్ 2017 (11:19 IST)

గుళ్లను కూల్చేసి బాత్రూమ్‌లు కట్టేసిన బాబును శివసేన ఎందుకు వదిలేసింది?: రోజా

శివసేనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతిలో తాను మాత్రమే రాజకీయాలపై మాట్లాడుతున్నానా? అని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు వంటి ఎంతోమంది తిరుమ

శివసేనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతిలో తాను మాత్రమే రాజకీయాలపై మాట్లాడుతున్నానా? అని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు వంటి ఎంతోమంది తిరుమల కొండలపై.. పవిత్ర పుణ్యేక్షత్రమైన శ్రీవారి సన్నిధిలో రాజకీయాలపై మాట్లాడారని గుర్తు చేశారు. శివ‌సేన వాళ్ల‌కి తాను చెప్పేది ఒక్క‌టేన‌ని, తాను హిందూ సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తాన‌ని రోజా వ్యాఖ్యానించారు. 
 
గుళ్ల‌ను కూల్చేసి ఆ స్థ‌లాల్లో బాత్‌రూంలు క‌ట్టిన చంద్ర‌బాబు నాయుడిని కూడా శివ‌సేన వారు నిల‌దీసి ఉంటే తాము సంతోషించేవారమ‌ని రోజా విమర్శించారు. దేవినేని ఉమా మహేశ్వరావు నాలుగు రోజుల ముందే శ్రీవారి సన్నిధికి వచ్చి రాజకీయాలపై మాట్లాడారని రోజా తెలిపారు. 
 
టీటీడీ బోర్డులో ఎంతోమంది దొంగ‌లు అడ్డంగా దొరికిపోయారని రోజా అన్నారు. అంతేగాకుండా టీటీడీ బోర్డులో లిక్కర్ మాఫియా వాళ్లు కూడా ఉన్నారని రోజా ఎత్తిచూపారు. తిరుమ‌ల కింద ఎన్నో బెల్టుషాపులు ఉన్నాయ‌ని ఆమె ఆరోపించారు. ఇంత‌మందిని ప్ర‌శ్నించ‌ని శివ‌సేన తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసిందని.. వారికో న్యాయం.. తనకో న్యాయమా అంటూ రోజా ప్రశ్నించారు.