శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (21:34 IST)

ఏపీకి ప్రత్యేక హోదా నిల్...? వెంకయ్య నాయుడు ఏ చెపుతారు...?!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో కేంద్ర ప్రణాళిక మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఇచ్చిన సమాధానంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. మరోవైపు ఇతర పార్టీలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒకవైపు ఎన్డీఎ ఏపీ హోదాపై నాటకాలు ఆడుతుంటే తెదేపా కేంద్రంలో ఎలా భాగస్వామ్యం అవుతూ కొనసాగుతోందంటూ విమర్శిస్తున్నాయి. 
 
విభజన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలంటూ డిమాండ్ చేశారనీ, అలాంటప్పుడు ఇపుడు ఆయన మౌనంగా ఎందుకు ఉంటున్నారనీ, అసలు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమని బదులిస్తారంటూ అడుగుతున్నారు.