శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2014 (07:36 IST)

ఆర్టీసీ బస్సులకు టీడీపీ - టీఆర్ఎస్ పార్టీల రంగులు : పసుపు.. గులాబీ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల రంగులు మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని బస్సులను ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ జెండా రంగు గులాబీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరిగే బస్సులకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ రంగు పసుపును వేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలను కూడా పంపింది. 
 
అలాగే, తెలంగాణలో 'పల్లెవెలుగు' బస్సుల పేరును 'గ్రామరథం'గా, ఏపీలో 'తెలుగు వెలుగు'గా మార్చనున్నారు. ఇంద్ర బస్సులను తెలంగాణలో రాజధానిగా, ఏపీలో 'నగర వారధి'గా మార్చాలని యోచిస్తోంది. బస్సులకు కొత్త రంగులద్దేందుకు సిద్ధమయింది. ఏపీలోని బస్సులకు 20 శాతం పసుపు రంగు, తెలంగాణలోని బస్సులకు 20 శాతం గులాబీ రంగు వేయాలని నిర్ణయించింది. ఈ రెండు రంగులూ, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల రంగులు కావడం గమనార్హం.