బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:25 IST)

శేషాచలం ఎన్‌కౌంటర్ కేసు... తీగలాగుతున్న పోలీసులు.. తమిళ సినీ నేత అరెస్టు.!

తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో ఆంధ్రా పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్‌ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్ కౌంటర్ బూటకం అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, తాము చేసింది అసలైన ఎన్ కౌంటర్ అని రుజువు చేసుకునేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. 
 
అందులో భాగంగా ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారిస్తున్న తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో సదరు వ్యక్తికి సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. 
 
శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు, వారితో సంబంధం ఉన్నవారిని పట్టుకునే విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గడంలేదు. ఈ క్రమంలో ఏపీ, తమిళనాడుకు చెందిన కొందరు నేతలు, మాజీ మంత్రులకు కూడా స్మగ్లింగ్ విషయంలో సంబంధాలున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సరైన ఆధారాలు చేతికి చిక్కితే పలువురు ప్రజాప్రతినిధులను కూడా అరెస్టు చేస్తారని సమాచారం.