అమ్మాయిలను వేధించిన 80మంది షీ టీమ్స్కు దొరికారోచ్!
తెలంగాణ సర్కారు షీ టీమ్స్ అదుర్స్ అనిపించాయి. హైదరాబాద్ నగర్ రహదారులపై నిఘా పెట్టిన షీ టీమ్స్కు 80 మంది చిక్కారు. మహిళలు, విద్యార్థినులను వేధించడం, అసభ్యంగా కామెంట్స్ చేయడం, ఈవ్టీజింగ్ వంటి నేరాలు చేసిన 80 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకొని వారిలో 16 మందిని శనివారం కోర్టులో హాజరు పరిచింది.
వీరిలో ఆరుగురికి 2 రోజులు, మరో ఇద్దరికి 3 రోజుల జైలు శిక్ష, జరిమానా, మరో ఎనిమిది మందికి స్వల్పపాటి జరిమానాను కోర్టు విధించింది.
ఈ సందర్భంగా అదనపు సీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ బస్టాపుల్లో ఈవ్టీజింగ్కు పాల్పడితే 2 రోజుల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. 15 మహిళా కళాశాలల వద్ద నిఘా పెట్టమని, నేరం చేస్తే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.