బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 12 జూన్ 2017 (19:15 IST)

బాబుకు షాక్... జగన్ గూటికి శిల్పా మోహన్ రెడ్డి?, అఖిలప్రియ సక్సెస్...

రాజకీయాల్లో ఇది మామూలే. అటువారు ఇటువైపుకు... ఇటువారు అటువైపుకు. తెదేపా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల స్థానంలో పోటీ చేసేందు

రాజకీయాల్లో ఇది మామూలే. అటువారు ఇటువైపుకు... ఇటువారు అటువైపుకు. తెదేపా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల స్థానంలో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన పలుమార్లు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు వద్ద అభ్యర్థనలు చేశారు. 
 
ఐతే సిట్టింగ్ స్థానం నుంచి తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మంత్రి అఖిలప్రయ పట్టుబడుతున్నారు. ఈ నేపధ్యంలో దాదాపు అఖిలప్రియ మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి నెలకొంది. దీనితో శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయినట్లు సమాచారం. పైగా స్థానిక నాయకులు కూడా తమను కరివేపాకులా చూస్తున్నారనీ, సముచిత స్థానం లేదని ఆయన కుతకుతలాడుతున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో ఈ విషయం సమాలోచనలు చేస్తున్నారు. దాదాపుగా పార్టీ మారడం ఖాయమంటున్నారు.