రిస్ట్ వాచ్తో హైటెక్ కాపీయింగ్: విద్యార్థి డీబార్!
రిస్ట్ వాచ్ లాంటి సెల్ ఫోన్తో హైటెక్ కాపీయింగ్కు పాల్పడిన విద్యార్థి డీబార్ అయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఇలియాజ్ అనే విద్యార్థి రెండో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడు. చేతికి ఉన్న గడియారం పదేపదే చూస్తూ పరీక్ష రాయడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ శ్రవణ్ అతని గడియారాన్ని పరిశీలించారు.
దీంతో సెల్ భాగాలన్నీ దానిలో కనిపించడంతో ప్రిన్సిపల్కు ఇలియాజ్ను అప్పగించారు. ఆ రిస్ట్ సెల్లో 20 సమాధానాలు నిక్షిప్తం చేసుకున్నట్టు గుర్తించారు. తన సెల్లో సమాధానాలు ఫీడ్ చేసుకుని దీనికి సెండ్ చేశానని, ఒకటి డిలీట్ చేసిన తరువాత ఇంకోటి వస్తుందని, వాటిని చూసి రాస్తున్నట్టు ఇలియాజ్ తెలిపాడు. దీంతో అతనిని డిబార్ చేస్తున్నట్టు ప్రిన్సిపల్ ప్రకటించారు.