శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (17:16 IST)

తల్లీ కొడుకుల మధ్య మనస్పర్ధలు.. వారం రోజులుగా ఆహారం లేదు..

మనస్పర్ధల కారణంగా 25 ఏళ్ల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు కూమారులు కూడా దూరం పెట్టడంతో ఏ గతీ లేక చెట్ల పుట్ల వెంట తిరిగుతోంది ఓ మహిళ. వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. శివపార్వతికి స్థానిక శ్రీనివాస కాలనీకి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. 
 
ఆ తర్వాత కుటుంబంలో తలెత్తిన కలహాల కారణంగా 25 ఏళ్ల క్రితం భర్త నుండి విడాకులు తీసుకుని ఇద్దరు కుమారులతో పుట్టింటికి చేరుకుంది. కొడుకులకు ఇంకా వివాహం కాలేదు. అయితే ఈ మధ్య తల్లీ కొడుకుల మధ్య కూడా వివాదాలు వచ్చాయి. అప్పటి నుండి కుటుంబీకులు ఆమెను సరిగ్గా చూసుకోలేదు. దాంతో ఆవేదనకు గురైన వృద్ధురాలు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయింది. 
 
గ్రామ శివారులోని పొలంలో ఉన్న తమ పాత ఇంటి శిథిలాల వద్ద తలదాచుకుంది. వారం రోజులుగా ఆహారం సరిగ్గా లేకపోవడంతో శరీరం నీరసించింది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు శివపార్వతి కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లీ కొడుకులను ఇంటికి పంపించారు.