శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:12 IST)

ఆస్తి కోసం తల్లిని నదిలో తోసేసిన కిరాతక కొడుకు.. రక్షించిన స్థానికులు!

కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని కుందూనదిలోకి తోసేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడో కిరాతక కన్నకొడుకు. ఈ దారుణానికి అక్కడి స్థానికులు గమనించడంతో చేతికి చిక్కకుండా పారిపోయాడు. అయితే, ఆ స్థానికలు వెంటనే నదిలోకి దిగి ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి... ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని తన పేరిట రాయాలని గత కొంత కాలంగా కొడుకు.... కన్న తల్లిని వేధిస్తూ వచ్చాడు. ఇదే విషయంపై తల్లీ కొడుకులకూ ఇంట్లో గొడవలు కూడా చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ రోజు ఉదయం పని ఉంది రమ్మంటూ తనను బయటకు తీసుకువెళ్లాడని.... కుందూనది వద్దకు చేరుకోగానే... ఒక్కసారిగా తనను నదిలోకి తోసేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. పోలీసులు పరారైన కోడుకు కోసం గాలిస్తున్నారు.