శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:07 IST)

అమ్మను గొంతునులిమి హత్య చేశాడు.. ఏమీ తెలియనట్టుగా పొలానికి వెళ్లాడు...

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ సమీపంలో కన్నతల్లినే కన్నబిడ్డ హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పొలానికి వెళ్లి.. పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి.. అమ్మకు ఫోన్ చేస్తే ఎంతకూ తీయడం లేదని, ఓ సారి ఇంటికి వెళ్ల

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ సమీపంలో కన్నతల్లినే కన్నబిడ్డ హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పొలానికి వెళ్లి.. పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి.. అమ్మకు ఫోన్ చేస్తే ఎంతకూ తీయడం లేదని, ఓ సారి ఇంటికి వెళ్లి చూడండంటూ చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి అమ్మ కిందపడి చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, సుజాత సోదరులు అనుమానం వ్యక్తం చేయడంతో మృతదేహానికి శవపరీక్ష జరిపారు. ఇందులో తల్లిని గొంతునులిమి హత్య చేసినట్టు తేలింది. ఈ విషయం తెలియగానే నిందితుడు పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బాలా నగర్, అల్మాస్‌ గూడకు చెందిన చప్పిడి జంగారెడ్డి, సుజాత (45) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో ఒక కుమారుడు మూడేళ్ల కిత్రం మరణించాడు. ప్రస్తుతం వీరి కుటుంబం మీర్‌పేటలోని ప్రశాంతిహిల్స్‌ కాలనీలో నివాసం ఉంటోంది. జంగారెడ్డి, సుజాత కుమారుడు రాజశేఖర్‌ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 12న సుజాతను చంపేశాడు. 
 
ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పొలానికి వెళ్లాడు. అక్కడ నుంచి పక్కింటి వారికి ఫోన్ చేసి.. అమ్మ ఫోన్‌ తీయడం లేదని, పొలానికి అన్నం తెస్తానని చెప్పి ఇంకా రాలేదని ఏమైందో చూడండంటూ చెప్పాడు. ఆ ప్రకారంగా వారు ఇంటికి వెళ్లి చూడగా, ఆమె పడుకొని ఉందని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన రాజశేఖర్‌ రెడ్డి తల్లి కిందపడి చనిపోయిందని ఇరుగు పొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. 
 
ఇంతలో సుజాత మరణవార్త ఆమె సోదరులకు తెలియడంతో వారు వచ్చి... ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సుజాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లుగా వెల్లడైంది. ప్రస్తుతం మృతురాలి కొడుకు రాజశేఖర్‌ రెడ్డి పరారీలో ఉండటంతో ఆస్తి కోసం అతడే తల్లిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.