శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (09:36 IST)

దీపావళికి ద.మ. రైల్వే రెండు ప్రత్యేక రైళ్లు విడుదల

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ పెరగడంతో తిరుపతి, కాకినాడల నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో ఒకటి బుధవారం రాత్రి 10 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి గురువారం ఉదయం 10.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఇదే రైలు తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి తిరుగు పయనం అయ్యి 24వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.
 
అదేవిధంగా కాకినాడ నుంచి సికింద్రాబాద్కు జనసాధారణ్ సూపర్ఫాస్ట్ ప్రత్యేక రైలు ఒకదాన్ని దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు 26వ తేదీ ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, సోమవారం వేకువజామున 3.50 గంటలకు కాకినాడ చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.