శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:31 IST)

అక్రమ సంబంధం అంటగట్టి అక్కను కొడుతున్నాడనీ బావను చంపేశాడు...

తన అక్కకు అక్రమ సంబంధం అంటగట్టి.. ఆమెను నిత్యం కొడుతుండటాన్ని తమ్ముడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో బావను నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఈ హత్య శ్రీకాకుళం జిల్లా పోలాకి వద్ద జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన దండాశి అప్పలనాయుడుకు, ఉర్జాం గ్రామానికి చెందిన జయలక్ష్మితో 2004లో పెళ్లి జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అప్పల నాయుడు పెళ్లికి ముందు ఓ ఫోటో స్టూడియోలో అసిస్టెంట్‌గా పని చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత వ్యసనాలకు బానిసగామారి అనారోగ్యానికిగురై గతకాలంగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీనికితోడు అప్పలనాయుడు భార్యపై అనుమానంతో తరచూకొట్టేవాడు.
 
ఈ విషయాన్ని జయలక్ష్మి కన్నవారైన ఉర్జాంలోని తన సోదరులు జలుమూరు అప్పన్న, రాంబాబులకు చెప్పి బాధపడేది. ఈ నెల 12న బావను ఉర్జాంలోని తమ ఇంటికి పిలిపించి బావ మరుదులిద్దరూ మందలించే ప్రయత్నం చేసి.. ఆయనపై చేయి చేసుకున్నారు. 
 
ఇంతలోనే విశాఖపట్నం కేజీహెచ్‌లో అప్పలనాయుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం తెలియటంతో అప్పలనాయుడు తమ్ముడు లక్ష్మణరావుకు అనుమానం వచ్చింది. తన అన్నను బావమరుదులే కొట్టిచంపేశారని పోలాకి పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.