అమ్మో... అంత మందినా..! వడదెబ్బకు తెలుగు రాష్ట్రాలలో 472 మంది మృతి
సూర్య ప్రతాపానికి తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లి పోతున్నాయి. జనం పండులాకుల్లా రాలిపోతున్నారు. బయటకు వెళ్లదామంటే తిరిగి వస్తామో లేదోననేంత వేడి ఉంటుందో. వడగాల్పులకు ఇప్పటి వరకు మొత్తం 472 మంది మృత్యువాత పడ్డారు. అదిత్య 369 సినిమాలో లాగా చాలా కాలం భూమిపై జీవించే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. భూగర్భంలో తలదాచుకోవాలేమో..
ఆంధ్రప్రదేశ్లో 204 మంది.. తెలంగాణలో 230 మంది మరణించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 67 మంది మరణించారు. అలాగే ప్రకాశం జిల్లాలో 63 మంది చనిపోయారు. అయితే ఇప్పటి వరకు 46 మంది మాత్రమే విపత్తు శాఖ తన ప్రాధమిక నివేదికలో వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు.