గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (16:29 IST)

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవట!

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి షాకింగ్ కామెంట్ చేశారు. పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
 
కాకినాడలో ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక విషయాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించడం లేదని సరస్వతి చెప్పారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందని ఎన్నికలప్పుడు ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానంద చెప్పారు. కానీ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరించిన ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అన్నారు.