శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:12 IST)

హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కలకలం... ముగ్గురి రక్త నమూనాల సేకరణ.. ఒక కేసు నిర్ధారణ

స్వైన్ ఫ్లూ మరోమారు రెచ్చిపోతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. అధికారులలో గుబులు పెరిగిపోతోంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో వారు ఉన్నారు. 
 
ఈ యేడాది మొదట నుంచి తెలంగాణలో ఇప్పటి వరకూ 2157 మందికి ఈ వ్యాధి సోకింది. ఇందులో 79 మంది మరణించారు. వాతావరణం చల్లబడుతుండడంతో స్వైన్ ఫ్లూ పెరుగుతోందనే అనుమానం కలుగుతోంది. ఖమ్మ జిల్లా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే మరో ఇద్దరు మాత్రం వైద్యుల పరీక్షలలో ఉన్నారు.