గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (14:47 IST)

కేసీఆర్ తలసానిల మళ్లీ భేటీ గోల : అసలేం జరుగుతోంది!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం కూడా కలిశారు.
 
 కాగా, తలసాని శ్రీనివాస యాదవ్ తెరాసలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారమే గంటల పాటు కేసీఆర్‌తో గంటల పాటు చర్చించిన తలసాని.. మంగళవారం కూడా టి. సీఎంతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.  
 
ఇదిలా ఉండగా.. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని జెన్కో సీఎండీ ప్రభాకర రావు అన్నారు. జల విద్యుత్ ప్రారంభం కావడంతో విద్యుత్ కోతలు తగ్గాయని చెప్పారు. విద్యుత్ డిమాండు కంటే సప్లై ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం కంటే చాలా ఎక్కువగా సప్లై ఉందని తెలిపారు.