గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:33 IST)

29న గులాబీ కండువా కప్పుకోనున్న తలసాని, తీగల, సోమేశ్వర్!

టీడీపీ తెలంగాణ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఈ నెల 29న గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే అన్నీ చర్చలు పూర్తయ్యాయని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. 
 
ఈ నేపథ్యంలో 29న మీర్ పేటలోని టీఆర్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో వీరిద్దరూ కారెక్కనున్నారని తెలిసింది. 
 
మరోవైపు వైకాపా నేత వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర్ రావు శనివారం టీఆర్ఎస్‌లోకి చేరనున్నారు. తద్వారా సోమేశ్వర్ రావు కూడా జంప్ జిలానీల లిస్టులోకి చేరారు. 
 
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో వైకాపా జిల్లా అధ్యక్ష పదవికి  సోమేశ్వర్ రావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపించారు. 
 
సోమేశ్వర్ రావు రాజీనామాతో వరంగల్ జిల్లాలో... వైకాపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.